దుర్గమ్మకు భక్తుల విరాళాలు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మకు భక్తుల విరాళాలు

Jan 11 2026 9:48 AM | Updated on Jan 11 2026 9:48 AM

దుర్గ

దుర్గమ్మకు భక్తుల విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. పెన మలూరు మండలం కానూరు మైత్రినగర్‌కు చెందిన కొల్లూరి రామ్‌ప్రకాష్‌ కుటుంబం నిత్యా న్నదానానికి రూ.లక్ష, హైదరాబాద్‌కు చెందిన భావన భాగ్యలక్ష్మి కుటుంబం రూ.1,00,101 విరాళం అందజేశాయి. ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన కిర్ల నాగవెంకట దుర్గానవీన్‌ కుటుంబం అమ్మవారి రూ.2,11,450 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. దాతలకు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మ వారి చిత్రపటంఅందించారు.

తెలుగు భాష, సాంస్కృతిక వైభవాన్ని పరిరక్షిస్తాం

భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో పున్నమిఘాట్‌లో నిర్వహించిన ఆవకాయ్‌ అమరావతి ఉత్సవాలు శనివారం ముగిశాయి. తొలుత నటసార్వభౌమ ఎన్టీఆర్‌ విశ్వరూపానికి నివాళి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమి చైర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ శ్రీకృష్ణుడి ధరించి పద్యాలు ఆలపించారు. గాయకుడు జావేద్‌ అలీ ఆలపించిన పాటలు శ్రోతలను అలరించాయి. మంత్రి దుర్గేష్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్‌ 17, 18, 19 తేదీల్లో అమరావతి ఆవకాయ్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తామన్నారు. త్వరలో నంది నాటకోత్సవాలను నిర్వహించి, నంది అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్‌ జైన్‌, ఎండీ ఆమ్రపాలి కాట, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్‌, షాజహాన్‌ బాషా, కలెక్టర్‌ లక్ష్మీశ, టీమ్‌ వర్క్‌ ఆర్ట్స్‌ సంస్థ ప్రతినిధులు సయ్యద్‌ శ్యామ్‌, సంజయ్‌ రాయ్‌ పాల్గొన్నారు.

బకాయిలు విడుదల చేయాలని వినతి

లబ్బీపేట(విజయవాడతూర్పు): కాంట్రాక్టర్లకు బకాయిలు విడుదల చేసి సంక్రాంతి జరుపుకొనే అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఉమ్మడి కృష్ణాజిల్లా అసోసియేషన్‌ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కోరారు. లబ్బీపేటలోని తమ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు మండవ సాయి మాట్లాడుతూ.. బడ్జెట్‌ లేకుండా టెండర్లు పిలవడంతో బిల్లుల బకాయిలు పేరు కుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతినాటికైనా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తే అదే కానుకగా భావిస్తామన్నారు. బకాయిలు రూ.10 వేల కోట్లకు చేరాయని వివరించారు. తాము బయట అప్పులు తెచ్చి పనులు చేశామని, వారికి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు తమ విజ్ఞప్తిని మన్నించాలని కోరారు. అమరావతి పనుల్లో చిన్న, మధ్య తర గతి కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి లింగం రవికిరణ్‌, కోశాధికారి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

‘లిఖిత’ సేవలు అభినందనీయం

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కృష్ణాజిల్లా పోలీసుశాఖకు లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఏలూరు రేంజ్‌ ఐజీపీ జి.వి.జి.అశోక్‌కుమార్‌ కొనియాడారు. కృష్ణాజిల్లా పోలీసుశాఖకు లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఆధ్వర్యంలో అందజేసిన తొమ్మిది బొలేరో వాహనాలను ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్‌, కాగిత కృష్ణప్రసాద్‌, ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడుతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీపీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ..ఈ వాహనాలను అవనిగడ్డ, బందరు రూరల్‌ స్టేషన్‌లకు ఉపయోగిస్తామన్నారు. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గట్టిపాటి శ్రీనివాసరావును ఐజీపీ, ఎస్పీ, ఎమ్మెల్యేలు కలిసి సన్మానించారు. బందరు డీఎస్పీ సీహెచ్‌. రాజ తదితరులు పాల్గొన్నారు.

దుర్గమ్మకు భక్తుల విరాళాలు 1
1/3

దుర్గమ్మకు భక్తుల విరాళాలు

దుర్గమ్మకు భక్తుల విరాళాలు 2
2/3

దుర్గమ్మకు భక్తుల విరాళాలు

దుర్గమ్మకు భక్తుల విరాళాలు 3
3/3

దుర్గమ్మకు భక్తుల విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement