గాంధారి(ఎల్లారెడ్డి): వ్యవసాయక్షేత్రాల్లో పడిపోయిన విద్యుత్ తీగలకు తగిలి గేదె మృతి చెందింది. మంగళవారం రాత్రి వీచిన గాలులకు మండలంలో ని గుర్జాల్ గ్రామశివారులోని వ్యవసాయభూముల్లో మూడు విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడిపోయా యి. బుధవారం ఉదయం ఎప్పటిలాగే గ్రామానికి చెందిన రైతులు తమ పశువులను మేతకు వదిలగా అప్పటికే భూమిపై పడిపోయిన 11కేవీ విద్యుత్ తీగలు తగిలి రైతు చిటికె కిష్టయ్యకు చెందిన గేదె మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ రూ.50వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.


