
డిపార్ట్మెంటల్ పరీక్షలకు సెక్షన్ 163 అమలు
ఖలీల్వాడి: టీజీపీఎస్పీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలకు సెక్షన్ 163 (బీఎన్ఎస్) అ మలు చేస్తున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పరీక్ష ఉంటుందన్నారు. అర్సపల్లి బైపా స్ రోడ్డులోని ఏవీ ఎంటర్ప్రైజెస్, మున్నూరు కాపు సంఘంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇ ద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద ఉండొద్దని, పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన
మొక్కలను అందించాలి
రెంజల్(నవీపేట్): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కు అవసరమైన ఇంటి మొక్కలను అందించాల ని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ సూ చించారు. నవీపేట్, అభంగపట్నం గ్రామాల ను గురువారం ఆయన సందర్శించారు. నర్సరీలను పరిశీలించి, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన నిమ్మ, దానిమ్మ, జామ, కరివేపాకు, బొప్పాయి వంటి మొక్కలను వన మహోత్సవంలో అందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఇళ్ల నుంచి సేకరించాలన్నారు. పొడి చెత్తను విక్రయించాలని, తడి చెత్తతో కంపోస్టు ఎరువులను తయారు చేసి నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు వినియోగించుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవో నాగనాథ్, ఎంపీవో రామకృష్ణలు పాల్గొన్నారు.
ఘనంగా రాహుల్గాంధీ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ సిటీ: నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో గురువారం పార్టీ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్గాంధీ 55వ జన్మదిన వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి, సంబురాలు చేసుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రాహుల్గాంధీ నేటి యువకులకు ఆదర్శనీయమన్నారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి దేశ ప్రజల సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్రెడ్డి, నాయకులు నరేందర్గౌడ్, నరేందర్ సింగ్, ప్రమోద్కుమార్, కోనేరు సాయికుమార్, రేవతి, పుప్పాల విజయ పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ అర్బన్: ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించనున్న సివి ల్స్ ఉచిత శిక్షణకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని రజిత ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహించి, ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయము రూ.మూడు లక్షలకు మించరాని అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి, అర్హతగలవారు ఈ నెల 18 నుంచి జూలై 7వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చేనెల 13న ఉదయం 10:30 గంటలకు నిజామాబాద్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 81216 26423ను సంప్రదించాలన్నారు.

డిపార్ట్మెంటల్ పరీక్షలకు సెక్షన్ 163 అమలు