
రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది
సుభాష్నగర్: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పసుపు రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని జిల్లాలోనే ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దినేశ్ పటేల్ మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా చైర్మన్గా జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారని తెలిపారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కూడా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసి పసుపు రైతులకు పెద్దపీట వేసిందన్నారు. కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల చివరి వారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీకి, ప్రారంభోత్సవానికి వస్తున్న అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ, కిసాన్ మోర్చా నాయకులు లక్ష్మీనారాయణ, అంతరెడ్డి హరీశ్రెడ్డి, పద్మారెడ్డి, కర్క గంగారెడ్డి, నక్క రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్
పటేల్ కులాచారి
‘అమిత్ షా’ కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలి