
‘ఆర్ఎంపీపై దాడి కుట్రలో భాగమే’
నిజామాబాద్నాగారం: డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ర్యాలీలో జరిగిన దాడి సంఘటన కుట్రలో భాగమేనని బోధన్ ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ అధ్యక్షుడు రాజాగోపాల్ చారి పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలో జరిగిన సంఘటన తమకు ఆందోళన కలిగించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 429 జీవో ప్రకారం గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇప్పించి, వైద్యులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమలోని ఐక్యతను చూసి ఓర్వలేని కొందరు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని భగ్నం చేసేందుకు కుట్ర పూరితంగా మహిళను రెచ్చగొట్టి తమపైకి ఉసిగొల్పారని ఆరోపించారు. తామంతా డాక్టర్ అశోక్కు మద్దతుగా జిల్లా సీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఆర్మూర్ శ్రీనివాస్, చందు, సాయిలు, ఖలీల్, అజార్, మోస్రా గంగారెడ్డి, బొద్దుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.