తన పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లో చేర్పించిన ఉపాధ్యాయుడు | - | Sakshi
Sakshi News home page

తన పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లో చేర్పించిన ఉపాధ్యాయుడు

Jun 19 2025 4:24 AM | Updated on Jun 19 2025 4:24 AM

తన పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లో చేర్పించిన ఉపాధ్యాయుడు

తన పిల్లలను ప్రభుత్వ స్కూల్‌లో చేర్పించిన ఉపాధ్యాయుడు

వేల్పూర్‌: వేల్పూర్‌ మండలం కుకునూర్‌ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన పతాని గంగాధర్‌ తన కూతురు, కొడుకును అదే ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. 9వ తరగతి చదువుతున్న కుమార్తె జాగృతిని హైస్కూల్‌లో, 3వ తరగతి చదువుతున్న కుమారుడు శ్రేయాన్స్‌ను ప్రైమరీ స్కూల్‌లో బుధవారం చేర్పించారు. పతాని గంగాధర్‌ గతేడాది ఏడాది జరిగిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా సొంత గ్రామంలో, తాను చదువుకున్న పాఠశాలలో పోస్టింగ్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం ద్వారా స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. దీంతో హైస్కూల్‌, ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎంలు హరిచరణ్‌, హరిప్రసాద్‌ ఆయనను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్‌రావు, మల్కన్న, సురేశ్‌, నాగరాజు, రవీందర్‌, చరణ్‌దాస్‌, అశోక్‌, నరేందర్‌, చంద్రశేఖర్‌, స్రవంతి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement