
మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థం
● జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి
నిజామాబాద్ లీగల్: మాదకద్రవ్యాల వినియోగం వలన మానవ జీవితపు నడక దారి తప్పుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మి అన్నారు. యువత బంగారు భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్ను సేవించకుండా ఉండాలన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినం జూన్ 26 న జరుపుకోనున్న నేపథ్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ రూపొందించిన జీవితంలో డ్రగ్స్కు నో చెప్పడం ఎలా..? అంశంపై గోడ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు, జిల్లా అదనపు పోలీస్ కమిషనర్ బస్వారెడ్డిలు పాల్గొన్నారు.