
నగరాభివృద్ధికి కృషి చేయాలి
సుభాష్నగర్: నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలెక్టర్ టీ వినయ్కృష్ణారెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ను ఎమ్మె ల్యే ధన్పాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, నగరాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు ప్రభాకర్, ఆనంద్, పవన్ ముందాడ, కృష్ణ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే
ధన్పాల్ సూర్యనారాయణ