మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించాలి
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో జిల్లాలోని 44 మంది డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రూ.250 కోట్ల మేర వసూలు చేయాల్సి ఉంది. పదేళ్ల నుంచి వసూలు చేయాల్సినవి సైతం ఉన్నాయి. అయితే నోటీసులిచ్చి వసూలు చేయడంలో మాత్రం అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని గత నెల 29న జరిగిన సమీక్ష సమావేశంలో అప్పటి ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రికవరీకి ప్రక్రియ మొదలుపెట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ చర్యలు ప్రారంభించలేదు. అయితే జిల్లా ఇన్చార్జి మంత్రి మారడంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లేననే చర్చ జరుగుతోంది. కొత్త కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత నెలకొంది.
● నిజామాబాద్ నగరంలోని నాగారంలో 1,200 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి నాలుగేళ్లు అయినప్పటికీ ఇంతవరకు వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో వీటిలోని శానిటరీ, ఎలక్ట్రికల్ పరికరాలు, తలుపులు, కిటికీలు చోరీకి గురయ్యాయి. మరోవైపు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి మరమ్మతుల కోసం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చొరవతో ప్రభుత్వం నుంచి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. కాగా పనులు ఇంకా మొదలు పెట్టలేదు.
● కీలకమైన రిజిస్ట్రేషన్ల శాఖలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లతో పాలన నడుస్తోంది. దీనిపైనా దృష్టి పెట్టాల్సి ఉంది.
● నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో గత కొన్నేళ్లుగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. శానిటేషన్ పనులను మూడు నెలల కిందట డీఎంఈ నరేందర్ కుమార్ ఇక్కడకు వచ్చి పరిశీలించారు. అంతకుముందు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చి స్వయంగా చూశారు. అయినా పరిస్థితి మారలేదు. జీజీహెచ్లో పనిచేస్తున్న వైద్యులు స్థానికంగా ఉండకపోగా, తరచూ గైర్హాజరు అవుతున్నారు. ఇక్కడ అంబులెన్స్ లేదు. ఎంఆర్ఐ స్కాన్ అందుబాటులో లేదు.
● మాతాశిశు సంరక్షణ కేంద్రం, క్రిటికల్ కేర్ విభాగం కొత్త భవనాల నిర్మాణం పూర్తి అయినప్పటికీ సేవలు మాత్రం ప్రారంభించలేదు. ట్రామా కేర్ సెంటర్కు భవనం నిర్మించినప్పటికీ పరికరాలు లేక ఆరేళ్లుగా ఆ భవనం నిరుపయోగంగా ఉంది.
● జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల సమస్య మొదలైంది. మరోవైపు మందుల కొరత, క్షేత్రస్థాయిలో వైద్యులు సక్రమంగా ఉండకపోవడం, సిబ్బంది కొరత వేధిస్తోంది.
● ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి ప్రతి ఏడాది వేసవి సెలవుల్లోనే మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన చేపడుతారు. ఈ ఏడాది నిధులలేమి కారణంగా చేపట్టలేదు. సుమారు రూ.15 కోట్లు అవసరం ఉంది.
● నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. వివిధ విభాగాల్లో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, అదనపు కమిషనర్, డిప్యూటీ సిటీ ప్లానర్, ఎంహెచ్వో వంటి కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భవనాల నిర్మాణాలకు అనుమతులలో విచ్చలవిడి అవినీతి చోటుచేసుకుంటోంది. పన్నుల వసూళ్లలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.
● పులాంగ్ వాగు అడుగడుగునా ఆక్రమణలతో కుచించుకుపోతోంది. దీని ఆక్రమణలను తొలగిస్తేనే నగరానికి వర్షాకాలంలో వరద ముప్పు తప్పుతుంది.
● విద్యాశాఖలో ఉపాధ్యాయుల గైర్హాజర్లు ఎక్కువగా ఉంటున్నాయి. మెరుగైన ఫలితాల కోసం ప్రణాళికలు సక్రమంగా అమలు కావడం లేదు. కస్తూర్బా, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా ఉంది. అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 760 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకు గాను రూ.42.38 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు. వీటిలో ఇప్పటివరకు రూ.21.32 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి.
నాగారంలో
డబుల్బెడ్ రూం ఇళ్లు
ఖానాపూర్ ప్రాంతంలో రైస్మిల్లులు
న్యూస్రీల్
ఎన్పీఏ తగ్గింపునకు మరింత కృషి
ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి
బ్యాంకు సిబ్బందికి అభినందనలు
ధరణి పోర్టల్లో పరిష్కారం కాని భూసమస్యలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం భూభారతి అమలు చేస్తున్న నేపథ్యంలో కీలకమైన భూసమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది. భూ సమస్యల కారణంగా గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి.
ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అంశాలు ఎన్నో..
టాస్క్గా మారిన 44 మంది డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రూ.250 కోట్ల
సీఎంఆర్ రికవరీ
ఇందూరు నగరపాలకం అస్తవ్యస్తం.. ఇన్చార్జి అధికారులతో
నెట్టుకొస్తున్న వైనం
ఆక్రమణలతో కుచించుకుపోయిన
పులాంగ్ వాగు
విద్య, వైద్య శాఖల్లో సమస్యలు..
ఉపాధ్యాయుల, వైద్యుల గైర్హాజర్లు
జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటిలో చాలా సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నవి సైతం ఉన్నాయి. కొన్ని అంశాలైతే సమస్యల కన్నా సవాళ్ల మాదిరిగా ఉన్నాయి. కలెక్టర్ వీటిపై ప్రత్యేక చొరవ చూపి పరిష్కరిస్తేనే తన మార్క్ చూపించుకున్నట్లవుతుందని పలువురు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఇసుక, మొరం, మెటల్ అక్రమ రవాణా అరికట్టాల్సి ఉంది. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన బోధన్ ఏరియా నుంచి అక్రమ ఇసుక రవాణా రాత్రి సమయాల్లో జోరుగా సాగుతోంది. మాక్లూర్, మోపాల్, ఎడపల్లి, ఆర్మూర్ తదితర ప్రాంతాలలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు
కొత్త కలెక్టర్కు పాత సవాళ్లు