తాగు నీటి అవసరాలకు ‘సాగర్‌’ జలాలు | - | Sakshi
Sakshi News home page

తాగు నీటి అవసరాలకు ‘సాగర్‌’ జలాలు

Jun 19 2025 4:02 AM | Updated on Jun 19 2025 4:02 AM

తాగు

తాగు నీటి అవసరాలకు ‘సాగర్‌’ జలాలు

నిజాంసాగర్‌: నిజామాబాద్‌, బోధన్‌, బా న్సువాడ పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం బుధవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్‌ గేట్ల ద్వారా ప్ర ధాన కాలువకు 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటిని డిస్ట్రిబ్యూటరి తూముల ద్వారా వృథా చేయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. బెల్లాల్‌ చెరువుతోపాటు అలీసాగర్‌ రిజర్వాయర్‌ వరకు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నా రు. మూడు రోజుల పాటు ప్రధాన కాలువ నీటి విడుదల కొనసాగనుంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రం వరకు 1,393.78 అడుగుల(6.3 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

అడ్మిషన్లు, తరగతులపై దృష్టి సారించండి

నిజామాబాద్‌అర్బన్‌: ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లతోపాటు ద్వితీయ సంవత్సరం తరగతుల నిర్వహణపై దృష్టి సారించాలని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్‌ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్‌ విద్య కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌లతో డీఐఈవో బుధవారం సమావేశమై సప్లిమెంటరీ ఫలితాలపై కళాశాలల వారీగా సమీక్షించారు. గతంతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల సంఖ్యను 25 శాతం పెంచాలని, అధ్యాపకుల సమయపాలన, హాజరు, పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కళాశాలల్లో చేపట్టాల్సిన మరమ్మతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ప్రయోగశాలల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు.

‘ఇందిరమ్మ ఇండ్లు’ యాప్‌పై ప్రత్యేక శిక్షణ

నిజామాబాద్‌ సిటీ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను మున్సిపాలిటీల అధికారు లు ‘ఇందిరమ్మ ఇండ్లు’ యాప్‌లో నమోదు చేస్తున్నారు. వివరాల నమోదు, ధ్రువీకరణ పత్రాల అప్‌లోడింగ్‌ వంటి అంశాలపై జి ల్లాలోని కంప్యూటర్‌ ఆపరేటర్లకు బల్దియా కార్యాలయంలో బుధవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ ము న్సిపాలిటీల్లో కంప్యూటర్‌లో వివరాలు న మోదు చేస్తున్న ఆపరేటర్లకు మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారి చిదుర రమేశ్‌ అవగాహన కల్పించారు. రేషన్‌, ఆధార్‌కార్డు, ల్యాండ్‌ డాక్యుమెంట్లు, బ్యాంక్‌ అకౌంట్‌, కు టుంబ సభ్యుల వివరాలు ఎలా నమోదు చే యాలో హౌజింగ్‌ బోర్డు అధికారి హేమంత్‌ వివరించారు. అనంతరం నగరంలోని దు బ్బ ప్రాంతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారుని వద్దకు వెళ్లి జియోట్యాగింగ్‌ చేసే విధానంపై క్షేత్రస్థాయిలో వివరించారు.

దోస్త్‌ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో దోస్త్‌ ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రత్యేక కేటగిరి వి ద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను బుధవారం పరిశీలించినట్లు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌ తెలిపారు. వర్సిటీ అడ్మిషన్స్‌ కా ర్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. ప్రత్యేక కేటగిరీ పీహెచ్‌సీ(దివ్యాంగులు), సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, ఎక్స్‌ ట్రా కర్క్యులర్‌ అక్టివిటీస్‌కు సంబంధించి ఎన్‌సీసీలో ఆరుగురు, స్పోర్ట్స్‌లో ముగ్గురు, సీఏపీలో ముగ్గురు మొత్తం 12 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఎన్‌ సీసీ ఆఫీసర్‌ డాక్టర్‌ రామస్వామి, వర్సిటీ ఫిజికల్‌ డైరక్టర్‌ బీఆర్‌నేత, అసిస్టెంట్‌ నరేశ్‌, రవీందర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

తాగు నీటి అవసరాలకు ‘సాగర్‌’ జలాలు 
1
1/1

తాగు నీటి అవసరాలకు ‘సాగర్‌’ జలాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement