
ప్రశాంతంగా టీజీ సెట్ కౌన్సెలింగ్
నిజామాబాద్ అర్బన్: టీజీ సెట్ కౌన్సెలింగ్ మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించే ఈ కౌన్సెలింగ్లో మొదటి రోజు 295 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలన చేశారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనట్లు సమన్వయకర్త భారతి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన ముగిసిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలన్నారు. ఈనెల 19 వరకు ఽధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, ఈనెల 20, 21న వెబ్ ఆప్షన్లు ఉంటాయన్నారు.