
అడవుల సంరక్షణ సామాజిక బాధ్యత
ధర్పల్లి: అడవుల సంరక్షణ సామాజిక బాధ్యత అని, భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ అడవులను రక్షించాలని ధర్పల్లి సీఐ భిక్షపతి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం అటవీ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అటవీ భూముల వివాదాలు, వాటి పరిష్కారాలపై అధికారులు చర్చించారు. అటవీ శాఖ భూములకు సంబంధించి వివాదాలు తలెత్తినప్పుడు పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఒకరికొకరు సహకారం చేసుకొని అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో డిచ్పల్లి సీఐ వినోద్ రెడ్డి, ఎస్సైలు రామకృష్ణ, ఎల్ రామ్, సందీప్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.