
స్లాటర్హౌస్ను పరిశీలించిన అధికారులు
నిజామాబాద్ సిటీ: కార్పొరేషన్ పరిధిలోని స్లాటర్ హౌస్ను నిర్మల్ జిల్లాకు చెందిన బల్దియా అధికారులు పర్యటించారు. మంగళవారం నాగారంలోని బాబన్ సాహెబ్ పహడ్లోని పశు, మేకల వధశాలను అధికారులు పరిశీలించారు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డిప్యూటీ ఈఈ హరిభువన్ గౌడ్, శానిటరీ ఇన్స్పెక్టర్ మేకల దేవిదాస్, ఖురేషీ సొసైటీ సభ్యులు అబ్దుల్ సమద్ ఖురేషీ, ఖాలీఖ్ ఖురేషీ, సాజిద్ ఖురేషీ, జాహెద్ ఖురేషీ, ఫహీం ఖురేషీ, సద్దాం ఖురేషీలతో కూడిన బృందం పరిశీలించింది. నిర్మల్ మున్సిపల్లో నూతనంగా నిర్మించనున్న స్లాటర్ హౌస్ కోసం మోడల్ను, స్లాటర్హౌస్ నిర్మాణం, వసతులు, మురుగునీరు, పశువుల వ్యర్థాల తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. మున్సిపల్ శానిటరి సూపర్వైజర్ సాజిద్ అలీ, ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, కృష్ణ, జవాన్లు ఉన్నారు.