
అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలి
ఖలీల్వాడి: కాలనీలోకి కొత్తగా వచ్చిన వారితో పాటు అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ సూచించారు. నగరంలోని రేణుకనగర్లోని రోడ్డు నెంబర్–1లో కాలనీవాసులకు పోలీసులు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై తన సిబ్బందితో కలిసి కాలనీని పరిశీలించారు. ప్రజలు నేరాలు, దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలు కాపాడడంలో ప్రజలు పోలీసులకు సహకారం అందించాలన్నారు. కాలనీలో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాలనీకి ఇన్చార్జిగా పోలీస్ కానిస్టేబుల్ రవిని నియమించామని ఏవైనా సమస్యలు ఉంటే 9912983825, లేదా డయల్ 100కు సమాచారం అందించాలన్నారు.