పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచాలి | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

Jun 18 2025 7:20 AM | Updated on Jun 18 2025 7:20 AM

పాఠశాలల పరిసరాలను  శుభ్రంగా ఉంచాలి

పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

మోపాల్‌: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల ల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎంఈవో గే మ్‌సింగ్‌ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, పారిశుధ్య కార్మికులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మా ట్లాడుతూ.. పాఠశాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. రిసోర్స్‌ పర్సన్‌ గంగా ప్రసాద్‌ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, కార్మికులు పాల్గొన్నారు.

కళాశాలలో యోగాపై అవగాహన

నిజామాబాద్‌అర్బన్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం నాగారంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో యోగాపై అవగాహన, ఆరోగ్యపరీక్షలు నిర్వహించారు. యోగా శిక్షకులతో సామూహిక యోగాసనాలు వేయించారు. జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి జె గంగాదాస్‌ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సయ్యద్‌ హైదర్‌, సూర్యకాంత్‌ రెడ్డి, ఉపాధ్యాయులు, ఆయుష్‌ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమాప్రసాద్‌, యోగా శిక్షకులు విజయ భాస్కర్‌, రాజేందర్‌, సిబ్బంది రమేశ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

నిర్మాణ పనులు ప్రారంభం

డిచ్‌పల్లి: రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ గ్రామ ప్రత్యేకాధికారి, మండల పశువైద్యాధికారి గోపికృష్ణ అన్నారు. మంగళవారం బీబీపూర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ముగ్గు వేసి భూమి పూజ నిర్వహించారు. కార్యక్ర మంలో జీపీ కార్యదర్శి గౌతమి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్‌ బదావత్‌ బలరాం, జరు పుల రవీందర్‌, సర్దార్‌, రవీందర్‌, బానోత్‌ మహిపాల్‌, కారొబార్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఎల్లమ్మ తల్లి విగ్రహ పున:ప్రతిష్ఠాపన

ధర్పల్లి: మండల శివారులో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గ్రామస్తులు పున: ప్రతిష్ఠాపన చేశారు. గ్రామస్తులు బోనాలను ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారికి వేడుకున్నారు.

రేపు టై ఉమెన్‌ రోడ్‌ షో

నిజామాబాద్‌ అర్బన్‌: ఈ నెల 19న టై ఉమెన్‌ రోడ్‌ షో నిర్వహిస్తున్నట్లు జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్‌ అధికారులు తెలిపారు. టై ఉమెన్‌– 2025 గ్లోబల్‌ ప్రోగ్రాంలో భాగంగా మహిళా పారిశ్రామిక వేతలకు మెంటరింగ్‌, ఇన్వెస్టర్లకు కనెక్ట్‌ చేయడం, లర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ను అంతర్జాతీయ వేదికలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రూపొందించామని తెలిపారు. 19న మధ్యాహ్నం 1.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఐటీ హబ్‌ నుంచి టై ఉమెన్‌ రోడ్‌ షో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు 6305396427 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement