అనుమతి పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలి | - | Sakshi
Sakshi News home page

అనుమతి పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలి

Jun 17 2025 5:30 AM | Updated on Jun 17 2025 5:30 AM

అనుమత

అనుమతి పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలి

నిజామాబాద్‌ అర్బన్‌: విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలల్లోని విద్యా ర్థులను చేర్పించాలని డీఈవో అశోక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులను జాయిన్‌ చేసే ముందు పాఠశాల వివరాలను తెలుసుకోవాలన్నారు. అనుమతి లేని పాఠశాలలో చేర్పిస్తే దానికి తల్లిదండ్రులే బాధ్యులని పేర్కొన్నారు.

బోనస్‌ డబ్బులు వెంటనే జమచేయాలి

నిజామాబాద్‌అర్బన్‌: ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బోనస్‌ డబ్బులను వెంటనే జమ చేయాలని కోరుతూ భారతీయ కిసాన్‌ సంఘ్‌ తెలంగాణ ఇందూరు జిల్లా కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్‌ అంకిత్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సాయారెడ్డి, నారాయణరెడ్డి, భూమారెడ్డి, దశరథ్‌రెడ్డి, వినయ్‌ కుమార్‌, సూర్యరెడ్డి, పాండురంగారావు, రైతులు పాల్గొన్నారు.

భూభారతితో సమస్యలు పరిష్కారం

ధర్పల్లి: భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని తహసీల్దార్‌ శాంత అన్నారు. మండల కేంద్రంలో సోమవారం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించారు. ఆర్‌ఐ రాజేశ్వర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని రూరల్‌ తహసీల్దార్‌ అనురుద్‌ అన్నారు. సోమవారం నగరంలోని రూరల్‌ పరిఽధిలో మల్కాపూర్‌ (ఏ)లో నాయబ్‌ తహసీల్దార్‌ వినయ్‌సాగర్‌ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు పరామర్శ

జక్రాన్‌పల్లి: మండలంలోని పడకల్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గైండ్ల చిన్నారెడ్డి, అర్గుల్‌లో జైడి రాజారామ్‌ ఇటీవల మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులను సోమవారం రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఐడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ మునిపల్లి సాయి రెడ్డి, నాయకులు శేఖర్‌ గౌడ్‌, చిన్నారెడ్డి, చిన్న సాయి రెడ్డి, నర్సారెడ్డి, పురుషోత్తం రెడ్డి, విఠల్‌ తదితరులు ఉన్నారు.

అనుమతి పొందిన  పాఠశాలల్లోనే చేర్పించాలి  
1
1/1

అనుమతి పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement