
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
సిరికొండ: పేద ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసి పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటు వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్మార్క్స్ అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో రైతాంగ పోరాటయోధుడు, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు నాయక్వాడి నర్సయ్య సంతాప సభను సోమవారం నిర్వహించారు. నర్సయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాంసాగర్ ఆయకట్టు రక్షణ, సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని, పంటలకు గిట్టుబాటు ధర, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాల్లో నర్సయ్య కీలక పాత్ర పోశించారన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నిమ్మల భూమేశ్, ఎల్లయ్య, గులాం హుస్సేన్, సంజీవ్, చిన్న గంగాధర్, నర్సాగౌడ్, పెద్దరాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.