
బ్యాంకులు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ఉండాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): బ్యాంకులు కార్పొరేట్ సామాజిక బాధ్యతతో ఉండాలని, వెనకబడిన గ్రామాలు, ప్రజల అభివృద్ధికి తోడ్పాటునందించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో సోమవారం 8 జిల్లాల ఎస్బీఐ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీస్ (ఏఓ) భవన నిర్మాణానికి డిప్యూటీ జనరల్ మేనేజర్ బిజయ్ కుమార్ సాహూతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, ఎల్లోల్ల సాయిరెడ్డి, సూర్యారెడ్డి, గంగారెడ్డి, మోహన్రెడ్డి, ప్రతాప్సింగ్, సతీష్రెడ్డి, రాజారెడ్డి, బోర్గాం శ్రీనివాస్ ఉన్నారు.