
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్లకు అర్జీలు సమర్పించారు. మొత్తం 123 ఫిర్యాదులు అందాయి. కాగా, ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ట్రై సైకిల్ ఇప్పించండి..
బయోమెట్రిక్ రావడం లేదు..
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
ప్రజావాణికి 123 ఫిర్యాదులు