
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
నిజామాబాద్ సిటీ/మోపాల్: : కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జిల్లాలోని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఆ దివారం జిల్లా కేంద్రంలోని కోటగల్లి, ఎన్ఆర్ భవన్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కె సుధాకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.ఓమయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఏఫ్టీయూ జిల్లా అధ్యక్షులు జీ.భూమయ్య హాజరై మాట్లాడారు.ఈ సమావేశంలో ఐక్య కార్మిక సంఘాల నాయకులు నరేందర్, కాజా మొయినుద్దీన్, భూమేష్, ఆజాద్ పాల్గొన్నారు.
రైస్ మిల్లు పరిశ్రమల్లో జూలై 9న జరిగే సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య కోరారు. ఏఐటీయూసీ రైస్ మిల్ ఫిట్టర్ యూనియన్ కార్యాలయంలో రైస్ మిల్లు ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 రకాల చట్టాలను పునరుద్ధరించి, నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్ పరిశ్రమలో ఎనిమిది గంటలకు మించి పని చేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం ఓవర్ టైం డ్యూటీలు చెల్లించాలని, పీఎఫ్ ,ఈఎస్ఐ, ఇన్సూరెన్సు సౌకర్యం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. అనిల్, ఉపాధ్యక్షులు జాఫర్, సహాయ కార్యదర్శి సాయిలు, లాయక్ ,రమేష్, తిరుపతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజు, శివకుమార్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.