
స్కానింగ్ సేవలు అందేనా..?
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్, ఏర్గట్ల మండల కేంద్రాలకు చెందిన గర్భిణులు లక్ష్మి, రాధ స్కానింగ్ చేయించుకునేందుకు మోర్తాడ్లోని 30 పడకల ఆ స్పత్రికి వచ్చారు. ఇక్కడ స్కానింగ్ యంత్రం ఉన్నా రేడియాలజిస్ట్ లేకపోవడంతో స్కానింగ్ చేసే అవకాశం లేదని వైద్యులు, సిబ్బంది చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు ఆర్మూర్లోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఫీజు చెల్లించి చేయించుకున్నారు. ఇది లక్ష్మి, రాధకు ఎదురైన పరిస్థితే కాదు. ఎంతో మంది గర్భిణులు తమ గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
గత ప్రభుత్వం సామాజిక ఆస్పత్రులకు స్కానింగ్ యంత్రాలను సమకూర్చినప్పటికీ రేడియాలజిస్ట్లను నియమించకపోవడంతో ఆ విభాగం సేవలు అందడం లేదు. మోర్తాడ్, బాల్కొండ, ధర్పల్లి, డిచ్ పల్లి, కోటగిరి, వర్ని, నవీపేట్లోని కమ్యూనిటీ ఆస్పత్రులు, బోధన్ ఏరియా ఆసుపత్రి, ఆర్మూర్ లోని వంద పడకల ఆస్పత్రి, జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రులకు స్కానింగ్ యంత్రాలను మంజూరు చేశారు. గైనకాలజిస్టులు, మత్తు వైద్యుల పోస్టులతోపాటు రేడియాలజిస్టుల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కానింగ్ సేవలు కేవలం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలోనే అందుతున్నా యి. గర్భిణులు ప్రసవం వరకు కనీసం మూడు సా ర్లు స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక్క సారి స్కానింగ్కు వెళ్తే రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చవుతోంది.
ప్రభుత్వం దృష్టి సారిస్తేనే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు గత ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేప ట్టింది. అయితే లక్షలు వెచ్చించి స్కానింగ్ యంత్రాలను సమకూర్చి రేడియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేయకపోవడంతో సేవలు అందడం లేదు. ప్రస్తుత ప్రభుత్వమైన ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్కానింగ్ సేవ లు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆస్పత్రుల్లో పడిఉన్న యంత్రాలు
రేడియాలజిస్ట్లు లేక తప్పని కష్టాలు
ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పరుగులు పెడుతున్న గర్భిణులు