
జిల్లాలో భూసార పరీక్షలు
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలో వ్యవసాయ భూము ల్లో భూసార పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు పైలట్ ప్రాజెక్టుగా బోధన్ డివిజన్లోని సాలూర మండలాన్ని ఎంపిక చేసింది. మరో పక్క నేషనల్ మిషన్ ఫర్ నే చురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) కింద జిల్లా వ్యా ప్తంగా 15 క్లస్టర్లలో కూడా భూసార పరీక్షలు చేయా లని వ్యవసాయ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ మట్టి పరీక్షలు ప్రస్తుత ఖరీఫ్ నుంచే ప్రారంభించాలని సూచించింది. దీంతో పైల ట్ ప్రాజెక్టు అయిన సాలూరలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు (ఏఈవోలు) మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మొత్తం 8 వేల శాంపిల్స్ తీయాలని ల క్ష్యం ఉండగా సాలూర మండలంలో 6125, ఎన్ఎంఎన్ఎఫ్ కింద జిల్లా అంతటా 1,875 శాంపిల్స్ సేకరించనున్నారు. ప్రతి కమతం కవరయ్యే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇందుకు వారు ఆసక్తి గల రైతులను గుర్తించి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ఏఈవోలు రైతుల భూముల్లోకి వెళ్లి మట్టి నమూ నాలు సేకరించి జిల్లా కేంద్రం మార్కెట్ యార్డులో ని భూసార పరీక్షల కేంద్రానికి పంపనున్నారు. వారు భూసార పరీక్షల ద్వారా ఏయే పంటలకు నే ల అనుకూలంగా ఉందో నివేదిక ఇవ్వనున్నారు. భూమిలో కర్బనాలు, నత్రజని, భాస్వరం, భౌతిక లక్షణం వివరాలు పూర్తిగా నివేదికలో ఉంటుంది. త ద్వారా రైతులు నేల పరిస్థితిని బట్టి పంటలు సాగు చేసుకోవచ్చు. కాగా ఇప్పటి వరకు 400 మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారి వీరాస్వామి తెలిపారు. రైతులు భూసార పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
● పైలట్ ప్రాజెక్టుగా
సాలూర మండలం ఎంపిక
● ఎన్ఎంఎన్ఎఫ్ కింద జిల్లాలో
15 క్లస్టర్లలోనూ మట్టి పరీక్షలు