
అనాథ బాలికకు ఆర్థిక సహాయం
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని బజార్కొత్తూర్లో త ల్లిదండ్రులను కోల్పోయిన అ నాథ బాలికకు ఆదివాసి నా యక్పోడు కులస్తులు ఆర్థిక స హాయం అందించారు. భవాని అనే బాలిక ఏడాది వ్యవధిలోనే తలిదండ్రులను కోల్పోయింది. దీంతో జిల్లా నాయక్పోడు కులస్తులు శనివారం గ్రామానికి వచ్చి భవానికి రూ. 90 వేల ఆ ర్థిక సహాయాన్ని, నెలకు సరిపడా నిత్యవసర వస్తువులను అందజేశారు. నిజామాబాద్లో ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరక్టర్ బండారి భోజన్న తన వంతుగా రూ. 50 వేలతో పాటు కులసంఘం సభ్యులు పోగు చేసి రూ.40 వేలు అందజేశారు. ఇందులో నుంచి రూ. 75 వేల భవాని పేరు బ్యాంకులో డిపాజిట్ చేసి మిగతా రూ. 15 వేల నగదును నిత్యవసర జీవనోపాధి ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసి నాయకపోడు గౌరవ అధ్యక్షులు బండారి భోజన్న, జిల్లా అద్యక్షులు గాండ్ల రాంచందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ లోలం గంగాధర్, ఉద్యోగుల సేవాసంఘం అధ్యక్షులు కోండ్రు నవీన్, పీజీ హెచ్ఎం సింగం వనిత, మండల నాయకులు మన్నె సాగర్, దుంపల శ్రీనివాస్, మేడిపల్లి గౌతం, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.