
దేశ సేవలో కూతురు..
మోర్తాడ్(బాల్కొండ): ఆర్మీలో చేరి దేశ సేవ చే యా లని ఆశించినప్పటికీ సాధ్యం కాలేదని, కానీ తన కూతురు ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తోందని గర్వంగా చెబుతున్నాడు గాండ్లపేట్ గ్రామానికి చెందిన ని మ్మల భోజారెడ్డి. పోలీసుశాఖలో కానిస్టేబుల్గా పని చేసిన ఆయన కుటుంబ సమస్యల కారణంగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్టీసీలో డ్రైవర్గా చేరాడు. దేశానికి సేవ చేయాలనే తన తండ్రి కల నెరవేరకపోవడంతో.. తాను దానిని నిజం చేయా లని ఆయన కూతురు గీతారాణి సంకల్పించింది. శ్రీపద్మావతి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ నర్సింగ్పూర్తి చేసింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఎన్నో కంపెనీలు భారీ వేతన ప్యాకేజీ ఆఫర్ చేసినప్పటికీ తన తండ్రి కలను నెరవేర్చేందుకు ఆర్మీలోని నర్సింగ్ విభాగంలో చేరింది.

దేశ సేవలో కూతురు..