
ఆర్టీసీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది సుశ
నిజామాబాద్ లీగల్: తెలంగాణ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్గా నిజామాబాద్కు చెందిన న్యాయవాది సుశ్మన్ రెడ్డి నియమితులయ్యారు. సుశ్మన్ రెడ్డి నియామకం పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్రాజ్, బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుశ్మన్ రెడ్డిని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. సీనియర్ న్యాయవాదులు అజార్ కిషన్ రావు, నారాయణదాస్, జగన్ గౌడ్, న్యాయవాదులు శ్యామ్ బాబు, శ్రీనివాస్ గౌడ్, సురేష్, ఇంతియాజ్, ప్రకాష్ గౌడ్, వినోద్ కుమార్ పాల్గొన్నారు.
ఎత్తిపోతల
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం
● ఆయిల్, కాపర్ వైరు చోరీ
● రూ.10 లక్షల ఆస్తినష్టం
రెంజల్(బోధన్): మండలంలోని తాడ్బిలోలి ఎత్తిపోతల పథకం మొదటి స్టేజీ గోదావరి నది ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ను దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేసి ఆయిల్, కాయిల్స్ను ఎత్తుకెళ్లారు. 2016లో ఇదే తరహా చోరీ జరిగింది. ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి చోరీ చేసినట్లు శుక్రవారం గుర్తించిన స్థానిక రైతులు ఎత్తిపోతల కమిటీ చైర్మన్ మౌలానాకు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. సుమారు రూ.10 లక్షల విలువైన ఆయిల్, కాయిల్స్ను దుండగులు ఎత్తుకెళ్లారని గుర్తించారు. విషయం తెలిసినా విద్యుత్ అధికారులు అక్కడికి రాకపోవడంపై ఆయకట్టు రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్టీసీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది సుశ