
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
సిరికొండ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పుస్తకాలను ఎంపీడీవో మనోహర్రెడ్డి పంపిణీ చేశారు. జీహెచ్ఎం సతీష్గౌడ్, ఆసిఫ్, ధర్పల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్పల్లి : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కాంగ్రెస్ నాయకులు కాటిపల్లి నర్సారెడ్డి, వినోద్ పంపిణీ చేశారు. హెచ్ఎం లింగన్న, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, మైనార్టీ శాఖ అధ్యక్షుడు అక్బర్, నట్ట తిరుపతి, ఆకాష్, మాడవేరి శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మోపాల్: సిర్పూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు దుస్తులు, నూతనంగా అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు ఎంఈవో గేమ్సింగ్ పంపిణీ చేశారు. గ్రామపెద్దలు ముత్యం, మధు, రజనీకాంత్, గంగాధర్, రాజేశ్వర్, ఉపాధ్యాయులు కాసర్ల నరేష్రావు, హజారే శ్రీనివాస్ పాల్గొన్నారు.