
పారిశుధ్యంపై అవగాహన
నిజామాబాద్ సిటీ:ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా నగరంలో పారిశుధ్య పనులు నిర్వహించా రు.శుక్రవారం చంద్రశేఖర్ కాలనీ,వి నాయక్నగర్లో ర్యాలీ నిర్వహించారు.గౌతంనగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పారిశుధ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఇళ్లలో తయారైన చెత్తను వేరుచేయడం, చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలు వ్యాప్తిచెందకుండా తీసుకునే జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పలు డివిజన్లలో డ్రెయిన్లను శుభ్రం చేశారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ జయ కుమార్, సూపర్వైజర్ సాజిద్ పాల్గొన్నారు.