
మండల కార్యాలయాలకు వెళ్లేదెట్లా..?
మోపాల్: మండల కేంద్రంలోని తహసీల్, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు తిప్పలు పడుతున్నారు. గురువారం ఉదయం కురిసిన వర్షానికి కార్యాలయాలకు వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు నిలిచి మడుగులా తయారైంది. ఆఫీస్కు నడక దారిన వచ్చే వారికి ఇబ్బందిగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో ప్రజలు కార్యాలయాలకు వస్తూ పోతుంటారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అనుమతుల్లేకుండా అడ్మిషన్లు
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఖిల్లా రోడ్డులోని గోల్డెన్ జూబ్లీ ఇంటర్మీడియట్ కళాశాలకు అనుమతులు లేకుండానే యాజమాన్యం అడ్మిషన్లు చేపడుతుందని అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి నాదిర్ షా రజానీ తెలిపారు. కళాశాలకు అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు సంబంధించిన భవనాన్ని కొన్ని సంవత్సరాల క్రితం లీజుకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే సంబంధిత లీజు గడువు ముగిసిందని, అంతేగాకుండా లీజు గడువు ముగిసినా ఎటువంటి ఒప్పంద ప్రక్రియ లేకుండానే జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లీజు గడువు ముగిసిన నేపథ్యంలో భవనాన్ని ఖాళీ చేయాలని ఇది వరకే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో వివాదం చెలరేగకుండా ట్రస్టు నుంచి న్యాయస్థానాన్ని ఆశ్రయించామని.. తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని తెలిపారు. ఈ విషయంపై ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని, వారు నిజామాబాద్ డీఐఈవోకు విచారణకు ఆదేశించారని తెలిపారు. అడ్మిషన్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. సమావేశంలో అల్ ముర్తుజా ఎడ్యుకేషన్ ట్రస్టు కోశాధికారి రజియాతో పాటు, సిబ్బంది పాల్గొన్నారు.
గోల్డెన్ జూబ్లీ కళాశాల అడ్మిషన్ల
విషయంలో తల్లిదండ్రులు
జాగ్రత్త వహించాలి
అల్ ముర్తజా ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు కార్యదర్శి నాదిర్ షా రజానీ

మండల కార్యాలయాలకు వెళ్లేదెట్లా..?