భూ భారతితో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యలు పరిష్కారం

Jun 14 2025 10:10 AM | Updated on Jun 14 2025 10:10 AM

భూ భా

భూ భారతితో సమస్యలు పరిష్కారం

ధర్పల్లి: భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలను పరిష్కారమవుతాయని తహసీల్దార్‌ శాంత అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం భూభా రతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించారు. ఇప్పటివరకు మండలంలో 892 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్‌ఐ రాజేశ్వర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మునిపల్లిలో..

జక్రాన్‌పల్లి: మునిపల్లిలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ కిరణ్మయి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ చిన్న సాయిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ సాయన్న, రైతులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: గత పదిరోజులుగా డిచ్‌పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు శుక్రవారం సాయంత్రం ముగిసినట్లు తహసీల్దార్‌ సతీష్‌ రెడ్డి తెలిపారు. ఘన్‌పూర్‌ జీపీ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో తహసీల్దార్‌ సతీష్‌ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఆర్‌ఐ సంతోష్‌, సిబ్బంది పాల్గొన్నారు. 35 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

భూ భారతితో సమస్యలు పరిష్కారం 1
1/2

భూ భారతితో సమస్యలు పరిష్కారం

భూ భారతితో సమస్యలు పరిష్కారం 2
2/2

భూ భారతితో సమస్యలు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement