
భార్యపై కోపంతో కొడుకు హత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భార్యపై కోపంతో నాలుగేళ్ల కొడుకును ఓ తండ్రి హతమార్చిన ఘటన గురువారం నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన బోయిని శ్రీహరి తన కూతురు అక్షితను ఐదేళ్ల క్రితం లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అనిల్కు ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి కొడుకు శశాంక్(4), కూతురు మనుశ్రీ (7 నెలలు) ఉంది. కాగా, అనిల్, అక్షిత పిల్లలతో కలిసి మంగళవారం మెదక్ జిల్లా శా లిపేట గ్రామంలో జరిగిన బోనాల పండుగ కో సం బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో అనిల్ చెల్లెలు కూతురు ను శశాంక్ మెట్లపై నుంచి తోసేశాడు. ఈ విషయమై శాలిపేటలో గొడవ జరిగింది. తిరిగి పొ ల్కంపేటకు చేరుకున్న తర్వాత భార్యాభర్తలిద్ద రూ గొడవ పడ్డారు. అదే సమయంలో అనిల్ తన భార్య అక్షితను కొట్టాడు. గురువారం అక్షితకు వైద్యం చేయించేందుకు పిల్లలతో కలిసి పోచారం గ్రామానికి వచ్చారు. అనంతరం కొడుకు శశాంక్ను బయట తిప్పుతానని చెప్పి బైక్పై పోచారం గ్రామశివారుకు తీసుకెళ్లాడు. శశాంక్ ముక్కు, నోరు మూసి స్పృహ కోల్పోయేలా చేసి అత్తారింటికి తీసుకువచ్చాడు. గమనించిన కుటుంబసభ్యులు శశాంక్ను చికిత్స నిమ్తితం మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వై ద్యులు బాలుడు అప్పటికే మృతి చెందాడని చె ప్పారు. అనిల్ను నిలదీయగా భార్యపై కోపంతో తానే శశాంక్ను హత్య చేశానని చెప్పి పారిపోయాడు. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఊపిరాడకుండా చేసి
అంతమొందించిన తండ్రి