
జిల్లా కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్అర్బన్ : జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్గా టీ వినయ్ కృష్ణారెడ్డి జిల్లాకు వస్తున్నారు. ఈ మేర కు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2013 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన
వినయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం ఆర్, ఆర్ అండ్ ఎల్ఏ, ఐక్యాడ్ కమిషనర్గా పనిచేస్తున్నారు. గతంలో సూర్యపేట కలెక్టర్గా, నీటిపారుదల కమాండ్ ఏరియా అభివృద్ధి శాఖ కమిషనర్గా చేశారు. రాజీ వ్ గాంధీ హనుమంతు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రెటరీగా వెళ్తున్నారు. అలాగే ఆయనకు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, భూభారతి కమిషనర్గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. రా జీవ్ గాంధీ హనుమంతు 2023 ఫిబ్రవరి 1న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈయన హయాంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి.
రెండు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారని పేరొచ్చింది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
రెవెన్యూ స్పెషల్ సెక్రెటరీగా
రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ