
ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ అధికారిగా..
సాలూర పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ ముఖద్వారం.. పూలతోరణాలతో అలంకరణ
ఆర్మూర్ : ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన చిట్ల పార్థ సారథి నేటి తరం విద్యార్థులకు ఆదర్శంగా నిలిస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రతియేటా తాను పుట్టిన ఊరుకు, చదివిన పాఠశాలకు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటున్నారు.
పార్థసారథి పదో తరగతి వరకు ఆర్మూర్ లోని జిరాయత్ నగర్ ప్రభుత్వ బాలుర ఉన్న త పాఠశాలలో చదువుకున్నారు. ఆర్డీవోగా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా, డీఆర్వోగా ఉద్యోగాలు చేశారు. యూపీఎస్ సీ ప్రొసీజర్ ఆధారంగా 1993 బ్యా చ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికై తన లక్ష్యా న్ని అందుకున్నారు. కలెక్టర్ గా, మార్క్ఫెడ్ ఎండీగా, ఐ అండ్ పీఆర్ కమిషనర్గా, చలన చి త్ర, టీవీ, నాటక రంగం సంస్థ ఎండీగా కొనసాగారు. తెలంగాణలో సివిల్ సప్లయీస్ కార్యదర్శి గా, తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. పదవీ విర మణ అనంతరం 2020 సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డారు.
రుణం తీర్చుకోలేనిది..
కన్నతల్లి, సొంత ఊరు, చదివిన పాఠశాల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ప్రభుత్వ పాఠశాలల్లో సైతం పట్టుదలతో విద్యనభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన దిశ గా కష్ట పడితే విజయం వారి సొంతమవుతుంది.
– చిట్ల పార్థ సారథి,
సేవా కార్యక్రమాలు..
పార్థసారథి తన తల్లిదండ్రుల పేరిట చిట్ల ప్రమీల జీవన్ రాజ్ మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతియేటా ఉన్నత ఫలితాలు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాల ను అందజేస్తున్నారు. విద్యార్థులను తరు చూ కలుస్తూ స్ఫూర్తి నింపుతున్నారు.
ఉన్నత శిఖరాలకు ఎదిగిన పార్థసారథి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా
బాధ్యతల నిర్వహణ

ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ అధికారిగా..

ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ అధికారిగా..