
75 ఏళ్ల ప్రస్థానం..
వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు కొత్త హంగులతో పాఠశాలలను ఇప్పటికే ఉపాధ్యాయులు సిద్ధం చేశారు. రంగులు వేసి, పూలతో అలంకరించి అందంగా తీర్చిదిద్దారు. మరోవైపు విద్యార్థులు సైతం నూతన విద్యాసంవత్సరంలోకి అడుగిడేందుకు ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి స్ఫూర్తిగా నిలుస్తున్న పూర్వ విద్యార్థుల పరిచయాలతో ప్రత్యేక కథనాలు..
బోధన్ : సాలూర మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ ప్రారంభించి 75 ఏళ్లు పూర్తికావస్తోంది. అప్పట్లో పాఠశాలకు చుట్టూ ఉన్న 8 గ్రామాల విద్యార్థులు 6 నుంచి 10 వతరగతి వరకు చదువుకునేందుకు ఇక్కడి వచ్చి అడ్మిషన్ల కోసం పోటీ పడే వారు. ఈ పాఠశాలలో చదువుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. కాలక్రమంలో అనేక కారణాల వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. తాజాగా పాఠశాల పరిస్థితులు మెరుగుపడి పూర్వ వైభవం సంతరించుకుంటున్న దశలో ఉంది. గురువారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున పాఠశాల ముఖద్వారాన్ని పూలతోరణాలతో అలంకరించి తీర్చిదిద్దారు. ఈ పాఠశాల హెచ్ఎం రాజీ మంజూష స్థానిక మండల విద్యాశాఖ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధిస్తూ పాఠశాల అభివృద్థిపథంలో ముందుకెళ్తోంది.
నాణ్యమైన బోధన..
పాఠశాలలో మౌలిక సౌకర్యాలు సమకూర్చుకుంటూనే, నాణ్యమైన విద్యాబోధనకు హెచ్ఎం, ఉపాధ్యాయుల బృందం నిరంతరం చేస్తున్న కృషికి మంచి ఫలితాలు వస్తున్నాయి. రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ప్రస్తుతం 269 మందికి చేరింది. అన్ని సబ్జెక్టులను బోధించేందుకు సరిపడా ఉపాధ్యాయులున్నారు. ప్రభుత్వం కల్పించిన ఐఎఫ్పీ (ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్) ద్వారా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఇటీవల పీ ఎం శ్రీ పాఠశాలగా ఎంపికై ంది. ఈ పథకం ద్వారా పాఠశాల అభివృద్ధికి నోచుకుంటోంది. అటల్ టింకరింగ్, కంప్యూటర్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నా యి. ఈ పథకం కింద విద్యార్థులను విజ్ఞాన యాత్ర కు తీసుకెళ్తారు. శారీరక, మానసిక ఉల్లాసానికి వి ద్యార్థులకు యోగ, కరాటే, ఆటలు నేర్పిస్తున్నారు.
ప్రతిభచాటిన విద్యార్థులు
ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు 46 మందికిగాను 43 మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. నేషనల్ మీన్కమ్ మెరిట్ స్కాలర్ షిప్నకు 8వ తరగతి విద్యార్థులు 8 మంది ఎంపికయ్యారు. జిల్లా సైన్స్ఫేర్లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు.
ఈ పాఠశాలలో 1971–72 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న సాలూరకు చెందిన ఇల్తెపు సాయన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో సీనియర్ సైంటిస్ట్ (సీనియర్ మేనేజర్)గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు.
పిల్లలను ప్రభుత్వ
పాఠశాలల్లో చేర్పించాలి
నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం మౌలిక సౌకర్యాలు క ల్పిస్తోంది. ఉపాధ్యాయ బృందం సమష్టి కృషితో వి ద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి.
– రాజీ మంజూష,
ఎంఈవో, హెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ సాలూర
పూర్వవైభవం సంతరించుకుంటున్న సాలూర జడ్పీహెచ్ఎస్
ప్రైవేట్కు దీటుగా పదో తరగతి
పరీక్ష ఫలితాలు..
ఉపాధ్యాయుల సమష్టి కృషి
స్ఫూర్తిదాయకం