అడ్మిషన్లకు పోటీ..! | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లకు పోటీ..!

Jun 12 2025 3:31 AM | Updated on Jun 12 2025 3:31 AM

అడ్మిషన్లకు పోటీ..!

అడ్మిషన్లకు పోటీ..!

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌) : జిల్లాలోని అన్ని పాఠశాలలతో పోల్చితే బోర్గాం(పి) జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల భిన్నం. ఇతర గ్రామాల్లో అడ్మిషన్ల కోసం బడిబాటలో భాగంగా ఉపాధ్యాయు లు, వీడీసీలు, యువజన సంఘాలతో కలిసి ఇంటింటికీ తిరిగితే.. ఈ పాఠశాలలో మాత్రం ఏప్రిల్‌ నుంచే అడ్మిషన్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతా యి. జిల్లాలో అడ్మిషన్ల కోసం పోటీ పడే ఏకై క ప్రభుత్వ పాఠశాల బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌. 2025–26 సంవత్సరానికిగాను 240 పైగా దరఖా స్తులు వచ్చాయి. నేటి నుంచి దరఖాస్తులను పరిశీ లించి సీటు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలుసైతం అడ్మిషన్ల కోసం పోటీ పడతారు.

హెచ్‌ఎంలుగా చేసిన గడ్డం గంగారెడ్డి (2006), పండరి సత్యనారాయణ (2012), నర్ర రామారావు (2019)లో జాతీయ ఉత్తమ ఉపాధ్యా య అవార్డులు అందుకున్న చరిత్ర పాఠశాలకు ఉంది. హెచ్‌ఎంలతోపాటు ఉపాధ్యాయ బృందం నిబద్ధతతో పని చేస్తుండటం వల్లే పదోతరగతిలో ప్రతియేటా 95 శాతం వరకు ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలోనే టాప్‌ పది పాఠశాలల్లో బోర్గాం(పి) ఒకటి.

సీటు దొరకని విద్యార్థులెందరో..

ఈ విద్యాసంవత్సరానికిగాను 240 పైగా దర ఖాస్తులు మే నాటికే వచ్చాయి. విద్యార్థులు టీసీ లు తీసుకొచ్చిన తర్వాతే అడ్మిషన్లు ఇస్తున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు తీసుకోవడంలేదు. ప్రతి ఏడాది ఎంతో మందికి సీటు దొరకడం లేదు. వి ద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పించడం పాఠశాల ప్రత్యేకత.

రాష్ట్రంలోనే టాప్‌ టెన్‌ పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు

920 మంది విద్యార్థులతో

కొనసాగుతున్న

బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement