
నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న కల్లెడ గంగాధర్
నిజామాబాద్నాగారం:భవన నిర్మాణ కార్మి కుల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటా లు చేస్తా మని సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ అన్నారు. శనివారం ప్రెస్క్లబ్లో మాట్లాడారు. జిల్లాలో 14 రంగాల కార్మికుల సమస్యల సాధనకు ఈ నెల 26న హైదరాబాద్లోని ముఖ్యమంత్రి ఇంటి వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొ న్నారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి న్యాయమైన డిమాండ్లు పట్టించుకోవడం లేదన్నారు. ఏడాది కాలంగా కార్మికులకు రావాల్సిన బెనిఫిట్ పెండింగ్లో ఉందన్నారు. కార్మికులు నిరసన కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ప్రెసిడెంట్ వేణు, కార్యదర్శి శాంతయ్య, హానీఫ్, పట్టణ అధ్యక్షుడు బాబురావుషిండే, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.