
డంపింగ్ యార్డులో మంటలు
నిజామాబాద్ సిటీ: నాగారం శివారులోని మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డులో తరచూ మంటలు చెలరేగుతున్నాయి. యార్డులో ప్లాస్టిక్ వ్యర్థాలు వేరుచేసే ప్రక్రియ సాగుతుండగా, ఎండవేడిమికి నిప్పురాజుకుంటోంది. లోపలి నుంచి వస్తున్న వేడి, దానికి తోడు పగటివేళలో వీచే వేడి గాలులతో నిప్పు రాజుకుంటోంది. ప్లాస్లిక్ వ్యర్థాలు, టైర్లు, పాలిథిన్ కవర్లు ఇతర వ్యర్థాలకు నిప్పంటుకొని అవిపెద్దగా మారుతున్నాయి. 10 పది రోజుల నుంచి డంపింగ్ యార్డులో నిత్యం మంటలు చెలరేగుతున్నాయి. సిబ్బంది అప్రమత్తమవుతూ ఆర్పివేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరోసారి మంటలు చెలరేగడంతో డంపింగ్ యార్డు ఇన్చార్జి ప్రభురాజ్ అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.