లక్ష్మణచాంద: రైతులు ఉద్యాన శాఖ అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ నిర్మల్ డివిజన్ అధికారి మౌనిక తెలిపారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో మహిళా రైతు కొండ్ర నర్సవ్వ సాగు చేస్తున్న కూరగాయలను శనివారం ఆమె పరిశీలించారు. అనంతరం రామకృష్ణారెడ్డి బెడ్ పద్ధతిని, మల్చింగ్ విధానంలో పంటలు సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పలు సూచనలు చేశారు. కూరగాయల సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎకరాకు రూ.9,600 రాయితీ ఇస్తుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు కూరగాయాల సాగుకు డ్రిప్, మల్చింగ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


