72 గంటల దీక్షను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

72 గంటల దీక్షను జయప్రదం చేయాలి

Aug 2 2025 7:07 AM | Updated on Aug 2 2025 7:07 AM

72 గంటల దీక్షను జయప్రదం చేయాలి

72 గంటల దీక్షను జయప్రదం చేయాలి

నిర్మల్‌టౌన్‌: బీసీల రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల మహా నిరాహార దీక్షను విజయవంతం చేయాలని యునైటెడ్‌ పూలే ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మారన్న కోరారు. నిర్మల్‌ ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం మాట్లాడారు. పార్టీలకతీతంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈనెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద కవిత 72 గంటల దీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు. దీక్షకు నిర్మల్‌ నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలిరావాలని కోరారు. అనంతరం నిరాహార దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణచారి, వడ్డెర సంఘం అధ్యక్షుడు భూపతి, నాయీబ్రాహ్మణ నాయకులు గంగాధర్‌, తెలంగాణ జాగతి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement