
నిర్మల్
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025
మహిళా ప్రాంగణాన్ని
సందర్శించిన ఆర్డీవో
సారంగపూర్: మండలంలోని చించోలి(బి) గ్రామ సమీపంలోని మహిళా ప్రాంగణాన్ని నిర్మల్ ఆర్డీఓ రత్నకళ్యాణి శుక్రవారం సందర్శించారు. ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మహిళా ప్రాంగణంలో ఎంపీహెచ్డబ్ల్యూవోకు సంబంధించి శిక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు. అనంతరం ప్రాంగణంలో వసతి గదులు, భోజనశాలను పరిఽశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీవో వెంట ప్రాంగణం అధికారి విజయలక్ష్మి ఉన్నారు.
లక్ష్మణచాంద: ఆసనాలు వేస్తున్న బాలికలు
తండ్రి చేస్తున్న యోగాసనాలను చూస్తూ పెరిగిన చైతన్య కేవలం ఐదేళ్లకే తానూ యోగా సాధన ప్రా రంభించింది. క్లిష్టమైన యోగాసననాలను సైతం సులువుగా వేస్తూ ఆకట్టుకుంది. తండ్రి ద్వారా నేర్చుకున్న విద్యలో పట్టు సాధించడమే కాకుండా పట్టా కూడా పొంది, పదిమందికి నేర్పిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని వెంకటాద్రిపేట్కు చెందిన ద్యావరశెట్టి చైతన్య యోగా ఇన్స్ట్రక్టర్గా సేవలందిస్తున్నారు. నిజామాబాద్కు చెందిన చైతన్య తండ్రి ప్రభాకర్ యోగాచార్యులుగా గుర్తింపు పొందారు. ఆయన ప్రోత్సాహంతో యోగాలో స్వల్పకాలంలోనే కఠినమైన ఆసనాల్లోనూ పట్టుసాధించారు. నాసిక్లోని యశ్వంత్రావు చౌహాన్ యూనివర్సిటీ నుంచి డిప్లోమా ఇన్ యోగా పూర్తిచేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ పతకాలు సాధించారు.
యోగాను మించింది లేదు..
నిత్యం ఒత్తిళ్లకు లోనవుతున్న ప్రస్తుత సమాజంలో యోగాను మించిన ఔషధం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం యోగా తప్పనిసరి. తండ్రి వారసత్వంగా సమాజానికి యోగా అందించడం గర్వంగా ఉంది. – ద్యావరశెట్టి చైతన్య
న్యూస్రీల్
ఐదేళ్లప్రాయం నుంచే..

నిర్మల్

నిర్మల్