
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమువుతుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
ఆర్జీయూకేటీలో సైబర్
భద్రతపై అవగాహన
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటి)లో ఐసీఐసీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ భద్రతపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు, సిబ్బందిలో సైబర్ భద్రతపై అవగాహన పెరిగిందన్నారు. కార్యక్రమంలో డిజిటల్ మోసాలు, సైబర్ భద్రతపై సమగ్ర అవగాహన కల్పించారు. ఐసీఐసీఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ, ఏపీకే ఫైళ్ల ద్వారా వచ్చే మోసాలు, సందేహాస్పద లింకులు, ఫోన్ కాల్ మోసాలు, ఫిషింగ్, గ్రిడ్ టెక్నిక్స్, బ్యాంక్ ఖాతాల హ్యాకింగ్పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జోనల్ డైరెక్టర్ సత్యపాల్రెడ్డి, దీపక్ మల్హోత్రా మాట్లాడుతూ, ఐసీఐసీఐ బ్యాంక్ 3ఇన్1 డిజిటల్ కార్డు గురించి వివరించారు. కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది శ్రీనివాస్, అసోసియేట్ డీన్లు డాక్టర్ విఠల్, నాగరాజు, చీఫ్ వార్డెన్ శ్రీ మధుసూదన్రెడ్డి, అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
పుస్తక రచన అభినందనీయం
భైంసాటౌన్: తెలంగాణ ఉద్యమంలో ముధోల్ నియోజకవర్గ పాత్రకు పుస్తకరూపమివ్వడం అభినందనీయమని కేంద్ర మాజీ మంత్రి ఎస్.వేణుగోపాలచారి అన్నారు. పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతిభవనంలో శుక్రవారం పుస్తకం ఆవిష్కరించి మాట్లాడారు. పుస్తక రచనకు కృషిచేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణగౌడ్, రచయితలను అభినందించారు. కార్యక్రమంలో కార్యదర్శి చాకేటి లస్మన్న, పుస్తక సంపాదకులు పుండలీక్రావు, నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.