
ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఆందోళన
ఖానాపూర్: అత్యంత వెనుకబడిన ఖానాపూర్ మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయాలని అఖిలపక్షం నాయకులు ఆకుల శ్రీనివాస్, నంది రామయ్య, లక్ష్మన్రావు, కొండాడి గంగారావు, గౌరీకార్ రాజు, కీర్తి మనోజ్ అన్నారు. ఈమేరు తహసీల్దార్ సుజాతను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని తిమ్మాపూర్ శివారులో ప్రభుత్వం మిగులు భూమి పోను 30 ఎకరాల భూమి ఉందని తెలిపారు. అధికారులు సర్వే చేపట్టి మిగులు భూమి వివరాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఖానాపూర్ వచ్చేవరకు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా అంతకుముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట ముఖానికి నల్ల గుడ్డలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమాల్లో కొక్కుల ప్రదీప్, రవీందర్, ప్రణయ్, ఉపేందర్, రమేశ్, ప్రణీత్, సతీశ్, నారాయణ, నసీర్, వెంకటేశ్, శ్రావణ్, వెంకటేశ్వర్రావు, మురళి, అజయ్, రవి, భీమన్న, సాయి తదితరులు పాల్గొన్నారు.