
ఆనందయోగం..
కిడ్నాప్ కేసులో ఆరుగురి అరెస్ట్
నిర్మల్ జిల్లాలో ఈనెల 15న సంచలనం సృష్టించిన కిడ్నాప్, హత్యాయత్నం, దొంగతనం కేసును నిర్మల్ పోలీసులు ఛేదించారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ను బలోపేతం చేయాలి
పార్టీకి కార్యకర్తలే బలమని.. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అన్నారు. శుక్రవారం కార్యకర్తల సమావేశాల్లో మాట్లాడారు.
9లోu
8లోu
యోగా.. రెండక్షరాల ఈ సాధనం నిండుజీవితాన్ని మార్చేస్తుంది. నిత్యసాధనతో ఎన్నో అద్భుతాలనూ చూపుతుంది. కొన్నిసార్లు మందులతో నయంకాని రోగాలనూ మాన్పుతుంది. విశ్వానికి మనదేశం అందించిన అద్భుత ఔషధం యోగా. విదేశీయులు సైతం మనదేశానికి వచ్చి యోగసాధన నేర్చుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. మనదైన ఈ యోగాభ్యాసాన్ని అందరూ నిత్యజీవితంలో భాగం చేసుకోవాలన్న లక్ష్యంతో ఏటా జూన్ 21న ‘ప్రపంచ యోగాదినోత్సవం’ నిర్వహిస్తున్నారు. జిల్లాలోనూ ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోనూ చాలామంది యోగాకు కేరాఫ్గా మారారు. తాము సాధన చేస్తూ.. పదిమందితో సాధన చేయిస్తూ.. యోగానందం పొందుతున్నారు. – నిర్మల్
జిల్లా కేంద్రానికి చెందిన ముధుల్కర్ అన్నపూర్ణది యోగా కుటుంబం. యోగాకు కేరాఫ్గా మారిన ఆమె తన కుటుంబ సభ్యులనూ యోగసాధనలో, శిక్షణలో భాగం చేశారు. భర్త చంద్రశేఖర్ ప్రోత్సాహంతో చిన్నప్పుడు నిజామాబాద్లో యోగాగురువు ప్రభాకర్ దగ్గర నేర్చుకున్న విద్యను పదిమందికి పంచుతున్నారు. యోగాతోపాటు నేచర్క్యూర్నూ నేర్చుకున్న అన్నపూర్ణ ఆ రెండింటి సమ్మిళితంగా ఎన్నో వ్యాధులు, రోగాల నుంచి బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నారు. అన్నపూర్ణతో పాటు కుమారులు సుమిత్, సాయికిరణ్, కోడళ్లు నవ్యశ్రీ, నమ్రత యోగా శిక్షకులుగా సేవలందిస్తున్నారు.
నిత్యజీవితంలో ఓ భాగంగా..
యోగా అనేది నిత్యజీవితంలో ఓ భాగంగా మారిపోవాలి. ప్రత్యేకంగా అని కాకుండా ప్రతిరోజూ సాధన చేయడం వల్ల జీవితాంతం మంచి ఫలితాలు ఉంటాయి. మా కుటుంబమంతా యోగా నేర్పించడంలో భాగం కావడం ఆనందంగా ఉంది. – అన్నపూర్ణ, యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు
యోగా కుటుంబం

ఆనందయోగం..