‘నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ దాడులు’ | Rajasthan-like raids in poll-bound Madhya Pradesh in next Four Days | Sakshi
Sakshi News home page

‘నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ దాడులు’

Oct 30 2023 6:14 AM | Updated on Oct 30 2023 6:14 AM

Rajasthan-like raids in poll-bound Madhya Pradesh in next Four Days - Sakshi

భోపాల్‌: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బృందాలు సోదాలు జరిపే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ జోస్యం చెప్పారు. ఇటీవలే రాజస్తాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్‌ సింగ్‌ దోతాస్రా ఇంటిపై ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.

పరీక్ష పేపర్‌ లీకేజీ కేసులో మనీల్యాండరింగ్‌ ఆరోపణలపై సోదాలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఆదివారం భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో దిగ్విజయ్‌ సింగ్‌ ఈ దాడులను ప్రస్తావించారు. ఒకపక్క అధికారులను వేధిస్తున్న బీజేపీ నేతలు, మరోపక్క రాజస్తాన్‌ లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ సోదా లు జరిపిస్తారని అన్నారు. దాడులు జరగటానికి అవకాశం ఉందంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లను ఆయన పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement