నక్సలైట్ల కాల్పుల్లో జవాన్ మృతి..!

చత్తీస్గడ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలోని కోటీ క్యాంపు సమీపంలో నక్సలైట్లు జవాన్లపై కాల్పులు జరిపిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. క్యాంప్ దగ్గరలోని ఓ కిరాణా షాపింగ్కి వెళ్లిన ఇద్దరు జవాన్లపై నక్సల్స్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన జవాన్ని దుష్యంత్ నందీశ్వర్గా గుర్తించి.. గాయపడిన జవాన్ని ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి