రూ.20 లక్షలు ఎత్తుకెళ్లిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. | Monkey Steals Jewellery Bag Worth Rs 20 Lakh In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

రూ.20 లక్షల నగల సంచి ఎత్తుకెళ్లిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Jun 8 2025 10:30 AM | Updated on Jun 8 2025 11:12 AM

Monkey Steals Jewellery Bag Worth Rs 20 Lakh In Uttar Pradesh

మధుర: శ్రీకృష్ణుడి జన్మస్థలంగా భావించే ఉత్తరప్రదేశ్‌లోని మధుర–బృందావన్‌లో వానరాల బెడద పెరిగిపోతోంది. భక్తుల వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళ్తుండడం పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ అధికారులు వాటి ఆగడాలను అదుపు చేయలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యాపారి నుంచి రూ.20 లక్షలకుపైగా విలువైన వజ్రాల నగలున్న సంచిని కోతి ఎత్తుకెళ్లింది.

అలీగఢ్‌కు చెందిన అభిషేక్‌ అగర్వాల్‌ బంగారు అభరణాల వ్యాపారి. కుటుంబంతో కలిసి శుక్రవారం బృందావన్‌ దర్శనానికి వచ్చాడు. తమ వద్దనున్న నగలను ఓ సంచిలో భద్రపర్చాడు. దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి కారు వద్దకు వెళ్తుండగా ఓ కోతి హఠాత్తుగా ఎక్కడి నుంచో వచ్చి, ఆ సంచిని లాక్కెళ్లింది. ఆందోళనకు గురైన అభిషేక్‌ అగర్వాల్‌ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు దొంగ మర్కటం కోసం వేట ప్రారంభించారు. 8 గంటల తర్వాత దాని ఆచూకీ కనిపెట్టారు. అదృష్ట ఏమిటంటే నగల సంచి దాని దగ్గరే ఉంది. కోతిని అక్కడి నుంచి వెళ్లగొట్టి, నగల సంచిని జాగ్రత్తగా తీసుకొచ్చి, బాధితుడికి అప్పగించారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement