భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం.. | married woman ends life in karnataka | Sakshi
Sakshi News home page

భార్య ఫోన్ మాట్లాడుతుందని.. భర్త దారుణం..

Jun 21 2025 9:28 AM | Updated on Jun 21 2025 11:53 AM

married woman ends life in karnataka

యశవంతపుర(కర్ణాటక): నిత్యం సెల్‌ఫోన్‌లో మాట్లాడుతోందని ఓ వ్యక్తి తన భార్యను హత మార్చాడు. ఈ ఘటన ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా హిలియాణ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో గణేశ్, రేఖ దంపతులు  నివాసం ఉంటున్నారు. ఇటీవల రేఖకు కొత్త సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు.   దీంతో  బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసి గంటల కొద్దీ మాట్లాడేది. 

ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడవద్దని భర్త హెచ్చరిస్తుండటంతో గొడవ జరిగేది. గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన గణేష్‌ భార్యతో గొడవకు దిగి కత్తితో కడుపు భాగంలో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఉడుపి జిల్లా బ్రహ్మావర తాలూకా శంకరనారాయణ పోలీసులు గణ్‌శ్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని  ఎస్పీ హరిరామ్‌ శంకర్‌ పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement