కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్‌ హైకోర్టు కీలక నిర్ణయం | Madras High Court Orders CBI Probe Into Kallakurichi Hooch Tragic Incident, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Kallakurichi: కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ: మద్రాస్‌ హైకోర్టు

Nov 20 2024 11:28 AM | Updated on Nov 20 2024 12:05 PM

Madras High Court Orders CBI Probe Into Kallakurichi Incident

చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్‌ కల్తీసారా విషయంలో మద్రాస్‌ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ‌ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్‌ సర్కార్‌ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ డీ. కృష్ణకుమార్‌, జస్టిస్‌ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement