జోషీమఠ్‌లో మరో విపత్తు.. స్థానికుల్లో ఆందోళన | Joshimath Sinking Again Potholes in the Middle of the Highway | Sakshi
Sakshi News home page

జోషీమఠ్‌లో మరో విపత్తు.. స్థానికుల్లో ఆందోళన

Jun 12 2024 1:04 PM | Updated on Jun 12 2024 2:38 PM

Joshimath Sinking Again Potholes in the Middle of the Highway

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కుంగుబాటు ఘటనను పూర్తిగా మరువకముందే మరో విపత్తు చోటుచేసుకుంది. తాజాగా జోషిమఠ్‌, బద్రీనాథ్‌ హైవే మధ్యలో అత్యంత లోతైన గొయ్యి ఏర్పడి  స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది.  

ఈ గొయ్యి మూడు అడుగుల వెడల్పు  కలిగివుంది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి ఈ గుంతను పూడ్చారు. అయితే చాలాచోట్ల వాటంతట అవే ఇలాంటి గుంతలు ఏర్పడటం ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గత సంవత్సరం జోషిమఠ్‌లో పలు చోట్ల భూమి కుంగిపోయింది.

ఈ నేపధ్యంలో తక్షణం కొన్ని వందల కుటుంబాలవారిని ఇళ్లు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. జోషిమఠ్‌లో భూమి కుంగిపోవడానికి కారణం ఇక్కడికి సమీపంలోని ప్రాజెక్టులేనని నిపుణులు తెలిపారు. తరుచూ ఇక్కడి భూమి కుంగిపోతున్నందున జోషిమఠ్‌ను మునిగిపోతున్న ప్రాంతంగా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement