మూడు రోజుల పాటు భారత్‌- నేపాల్‌ సరిహద్దు మూసివేత! | India Nepal Border Sealed for 3 Days | Sakshi
Sakshi News home page

మూడు రోజుల పాటు భారత్‌- నేపాల్‌ సరిహద్దు మూసివేత!

May 6 2024 11:52 AM | Updated on May 6 2024 12:57 PM

India Nepal Border Sealed for 3 Days

2024 లోక్‌సభ ఎన్నికల మూడో దశ నేపధ్యంలో బీహార్‌కు ఆనుకుని ఉన్న నేపాల్ సరిహద్దును  72 గంటల పాటు మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలైన మధుబని, ఖుటోనా, జయనగర్‌ నుంచి నేపాల్‌ మీదుగా వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. 7వ తేదీన బీహార్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఖుటోనా, లద్నియా, పరిసర రాష్ట్రాలు, జిల్లాలు, దేశ సరిహద్దులతో సహా మధుబని లోఖా, లాల్మునియన్, జైనగర్, ఝంఝర్‌పూర్‌లలో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఇదేవిధంగా లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా చోట్ల భారీగా భద్రతా బలగాలను మోహరించారు. వృద్ధ ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  బీహార్‌లోని ఈ ప్రాంతంలో భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. మధుబని లోక్‌సభ స్థానానికి మే 20న ఎన్నికలు జరగనుండగా, అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement