రైల్వే ఛార్జీల పెంపు ప్రైవేట్‌ సంస్థలకే..! | Government To Allow Private Railways To Set Their Own Fares | Sakshi
Sakshi News home page

రైల్వే ఛార్జీల పెంపు ప్రైవేట్‌ సంస్థలకే..!

Sep 18 2020 3:14 PM | Updated on Sep 18 2020 3:24 PM

Government To Allow Private Railways To Set Their Own Fares - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ సంస్థలు దేశంలో రైల్వే సేవలను ప్రారంభించిన తర్వాత ప్రయాణీకులను ఛార్జీలను నిర్ణయించడానికి ప్రైవేట్‌ వ్యక్తులకే పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. అయితే అదే మార్గాల్లో ఎయిర్‌ కండిషన్డ్‌ బస్సులు, విమానాలు ఆయా మార్గాల్లో నడుస్తాయి. ఛార్జీలను నిర్ణయించే ముందు వారు వీటన్నింటినీ గుర్తుంచుకోవాలి. భారతదేశంలో రాజకీయంగా రైల్వే ఛార్జీలు సున్నితమైన అంశంగా ఉంటాయి. ఇక్కడ రైళ్లు ప్రతిరోజూ ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మంది ప్రయాణీకులను తీసుకువెళుతున్నాయి. దేశంలో కొంత మంది రవాణా కోసం విస్తృతమైన నెట్‌వర్క్ మీద ఆధారపడి ఉంటారు.  (2023లో మొదటి దశ ప్రైవేట్‌ రైళ్లు)

దశాబ్దాల నిర్లక్ష్యం, అసమర్థ బ్యూరోక్రసీ ఈ నెట్‌వర్క్‌ను చుట్టుముట్టింది. పీఎం మోడీ పరిపాలన స్టేషన్లను ఆధునికీకరించడం నుంచి ఆపరేటింగ్ రైళ్ల వరకు ప్రతిదానిలో పాల్గొనమని ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది' అని వీకే యాదవ్‌ పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టులపై ఆల్స్టోమ్ ఎస్‌ఐ, బొంబార్డియర్ ఇంక్, జిఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఆసక్తి చూపిస్తున్న సంస్థలలో ఉన్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులపై 7.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా. 2023 నాటికి జపాన్‌ సాయంతో దేశంలో తొలి బుల్లెట్‌ రైలును పరుగులు పెట్టించాలని ధృడ సంకల్పంతో ఉన్న మోదీకి రైల్వేలను ఆధునికీకరించడం చాలా ముఖ్యం. 

అయితే.. దేశంలో ప్రైవేట్‌ రైళ్ల ఆగమనంలో భాగంలో మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. 2023–24లో మరో 45 రైళ్లు, 2026–27 నాటికి  151 ప్రైవేట్‌ రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151 ఆధునిక ప్యాసింజర్‌ రైళ్లు నడపడానికి రైల్వే శాఖ ఇటీవలే ప్రైవేట్‌ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. వచ్చే ఏడాది మార్చిలో టెండర్లను ఖరారు చేయనున్నారు. 2023 మార్చి నుంచి ప్రైవేట్‌ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు.  151 ప్రైవేట్‌ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని  అంచనా వేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement